ఆర్టీసీ బస్సుల్లో నేటి నుంచి టికెట్‌పై రూ.10 పెంపు

-

తెలంగాణ రాష్ట్ర ప్రయాణికులకు బిగ్‌ అలర్ఠ్. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు టికెట్ ధర నేటి నుంచి రూ. 10 పెరగనుంది. ఈ పెంపుతో ప్రయాణికుడికి అర లీటర్ జీవా వాటర్ బాటిల్ అందించమన్నారు. ఇంతకాలం ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు మంచినీటి సీసాలు అందించే పద్ధతి ఇప్పుడు సూపర్ లగ్జరీ బస్సులోను ప్రవేశపెడుతున్నారు.

ఈ నేపథ్యంలో దూరంతో ప్రమేయం లేకుండా టికెట్ ధరపై రూ.10 అదనంగా వసూలు చేయనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 700 సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి. కాగా, హైదరాబాద్​లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో పుష్పక్‌ బస్సు ఎక్కినవారు నగరంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అందుబాటులోకి తెచ్చింది. పుష్పక్‌ బస్సులో టిక్కెట్‌ కొన్న క్షణం నుంచి 3 గంటలపాటు ఈ ఉచిత ప్రయాణ సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news