స్వీస్ ఓపెన్ టోర్నీలో ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు, ప్ర‌ణ‌య్

-

స్విర్జ‌ర్లాండ్ లోని బాసెల్ వేదిక‌గా స్వీస్ ఓపెన్ వ‌రల్డ్ టూర్ స‌పర్ – 300 బ్యాడ్మింట‌న్ టోర్నీ జ‌రుగుతున్న విషయం తెలిసిందే. కాగ ఈ టోర్నీ లో భార‌త స్టార్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్లు పీవీ సింధు, ప్ర‌ణ‌య్ ఫైన‌ల్ కు దూసుకెళ్లారు. పీవీ సింధు స్వీస్ ఓపెన్ లో వ‌రుస‌గా రెండో సారి ఫైన‌ల్ కు వెళ్లింది. కాగ శ‌నివారం జ‌రిగిన మ‌హిళ‌ల సింగిల్స్ సెమీ ఫైన‌ల్ లో పీవీ సింధు సూప‌ర్ విక్ట‌రీని న‌మోదు చేసింది. థాయ్ లాండ్ కు చెందిన సుప‌నిద క‌టెథోంగ్ పై 21 – 18, 15 – 21, 21 – 19 తేడాతో విజయం సాధించింది. ఈ గేమ్ దాదాపు 80 నిమిషాల పాటు జ‌రిగింది. కాగ నేడు స్వీస్ ఓపెన్ ఫైన‌ల్ జర‌గ‌నుంది.

ఈ ఫైన‌ల్ మ్యాచ్ లో పీవీ సింధు.. థాయ్ లాండ్ కు చెందిన ఒంగ్ బ‌మ్ రుంగ్ ఫ‌న్ తో త‌ల ప‌డ‌నుంది. కాగ గ‌త ఏడాది కూడా స్వీస్ ఓపెన్ ఫైన‌ల్ ఆడింది. అయితే అప్ప‌టి ఫైన‌ల్ మ్యాచ్ లో స్పెయిన్ కు చెందిన క‌రోలినా మారిన్ చేతిలో ఓట‌మిపాలై ర‌న్న‌ర‌ప్ గా నిలించింది. అయితే ఈ సారి విజ‌యం సాధించి త‌న ఖాతాలో స్వీస్ ఓపెన్ ను వేసుకోవాల‌ని చూస్తుంది.

అల‌గే మెన్స్ సింగిల్స్ భారత స్టార్ బ్యాడ్మింట‌న్ ఆట‌గాడు ప్ర‌ణ‌య్ కూడా ఫైన‌ల్ కు చేరుకున్నాడు. సెమీ ఫైన‌ల్ లో ఇండోనేసియా కు చెందిన జిన్ టింగ్ పై ప్ర‌ణ‌య్ 21-19, 19,-21, 21-18 తేడాతో విజ‌యం సాధించాడు. కాగ మ‌రో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో కిదాంబి శ్రీ‌కాంత్ ఓడిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news