మళ్లీ టీమిండియా కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్!

-

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి మైదానంలోకి బరిలోకి దిగనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు భారత రోడ్డు రవాణా, హైవేలు మరియు ఐటీ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో అలనాటి ఆటగాళ్లతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ సీజన్ అభిమానులను అలరించింది.

కరోనా కారణంగా కాస్త బ్రేక్ వచ్చిన ఈ సిరీస్ మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ రెండో సీజన్ లో ఇండియన్ లెజెండ్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియన్ లెజెండ్స్ తో పాటు, ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్ లో కొత్తగా న్యూజిలాండ్ టీం చేరడంతో మొత్తం జట్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇక రోడ్డు సేఫ్టీ వరల్డ్ సిరీస్ తొలి సీజన్ లో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ లోనే ఇండియా లెజెండ్స్ ఫైనల్ లో శ్రీలంక లెజెండ్స్ ను చిత్తు చేసి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news