విరాట్ కోహ్లీ ఒక్కడే ఎంతని ఆడగలడు : గవాస్కర్ సానుభూతి

-

విరాట్ కోహ్లీ ఒక్కడే ఎంతని ఆడగలడు అంటూ సునీల్‌ గవాస్కర్ సానుభూతి వ్యక్తం చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లపై సునీల్ గావస్కర్ మండిపడ్డారు. విరాట్ కోహ్లీ ఎంతని ఆడతాడో…. మీరే చెప్పండి… ఎవరైనా అతనితో నిలబడాలి కదా అంటూ ఫైర్ అయ్యారు. కేకేఆర్ తో మ్యాచ్లో కూడా ఈ ఆటగాడైనా అతనికి మద్దతిస్తే అతను ఖచ్చితంగా… 83 కి బదులు 120 పరుగులు చేసేవాడని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు.

sunil gavaskar comments on kohli

టీం సభ్యులంతా కలిసి ఆడితేనే.. మ్యాచ్ విన్ అవుతుందని తెలిపారు. లేకపోతే కష్టమేనని వివరించారు. కాగా, ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మరో ఓటమిని చవిచూసింది. గెలవాల్సిన మ్యాచ్లో దారుణంగా ఓడిపోయింది. నిన్న ఆర్సిబి జట్టు పై కేకేఆర్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ బ్యాటర్ సునీల్ నరైన్ విధ్వంసకర బ్యాటింగ్ తో… కోల్కత్తా నైట్ రైడర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news