చెన్నై ఓటమికి మెయిన్ రీజన్ అది ఒక్కటే…!

-

ఐపిఎల్ లో చెన్నై టీం నిన్న ఓడిపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గెలిచే అవకాశాలను ఆ జట్టు చేజార్చుకుంది. ముఖ్యంగా ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ విషయంలో ఆ జట్టు చేసిన తప్పులే ఓటమి దిశగా నడిపించాయి. ఒక్క క్యాచ్ కాదు నాలుగు క్యాచ్ లు చెన్నై వదిలేసింది. మంచి ఫీల్డర్ లు కూడా అతని క్యాచ్ లు వదిలేయడం జట్టు ఓటమికి ప్రధాన కారణం అయ్యాయి.

చివరి ఓవర్ లో బ్రావో బౌలింగ్ చేయకపోవడం కూడా చెన్నై జట్టుని బాగా ఇబ్బంది పెట్టింది. జడేజా బౌలింగ్ లో అక్షర్ పటేల్ స్వేచ్చగా సిక్సులు కొట్టాడు. 9 మ్యాచ్‌ల్లో 6 ఓటముల తర్వాత తప్పక గెలవవలసిన మ్యాచ్ లో చెన్నై ఈ తప్పులు వరుసగా చేసింది. నాణ్యమైన బ్యాట్స్‌మన్‌ను ఒక్కసారి కూడా వదలడం తప్పే అని సునీల్ గవాస్కర్ న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news