ఉప్పల్ వేదికగా ఈనెల 12న టీ-20 మ్యాచ్

-

టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మూడు టీ-20 సిరీస్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టీ-20 మ్యాచ్ లు జరగగా రెండింటిలో కూడా భారత్ ఘన విజయం సాధించింది. ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడో టీ-20 నామమాత్రపు మ్యాచ్ లో టీమిండియా తరుపున ఎవరెవరూ ఎంట్రీ చేస్తారనేది ఆసక్తికరమైన అంశం అనే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. మూడో టీ-20 హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈనెల 12న విజయదశమి రోజు జరగడం విశేషం. వాస్తవానికి విజయదశమి పండుగ అంటే దాదాపు అందరూ ఊర్లళ్లకు వెళ్తుంటారు. అయినప్పటికీ టికెట్లను భారీగానే కొనుగోలు చేసినట్టు సమాచారం.  ఈ మ్యాచ్ ను చూసేందుకు ప్రేక్షకులు అంతగా రారని భావిస్తున్నారు. భారత్‌-బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో టి-20 ఆడేందుకు మరి కాసేపట్లోనే హైదారాబాద్ చేరుకోనున్నాయి భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్లు. పార్క్ హయత్ లో భారత్‌, తాజ్‌కృష్ణ లో బంగ్లాదేశ్‌ జట్లకు బస చేయనున్నారు. రేపు ఉదయం ఉప్పల్ స్టేడియంలో రెండు జట్లు ప్రాక్టిస్ చేయనున్నాయి.  ఈ మ్యాచ్ లో కూడా టీమిండియానే విజయం సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news