వైజాగ్ టెస్టులో ఘ‌న విజ‌యం సాధించిన టీమిండియా…

-

వైజాగ్ టెస్టులో ఘన విజయాన్ని భారత్ జట్టు అందుకుంది. విశాఖపట్నం వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటిన భారత్ జట్టు 203 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 395 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆటలో ఆఖరి రోజైన ఆదివారం 11/1తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన సఫారీలు.. భారత బౌలర్లు మహ్మద్ షమీ (5/35), రవీంద్ర జడేజా (4/87) దెబ్బకి 191 పరుగులకే ఆలౌటైపోయారు.

దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది. వైజాగ్ టెస్టుని ఆఖరి రోజు డ్రాగా ముగించాలని ఆశించిన దక్షిణాఫ్రికా జట్టు.. భారత్ బౌలర్ల దెబ్బకి రెండో సెషన్‌లోనే కుప్పకూలిపోయింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ పుణె వేదికగా ఈనెల 10 నుంచి ప్రారంభంకానుంది.

Read more RELATED
Recommended to you

Latest news