ఆ పొట్టొడికి నేను సారీ చెప్పలేదు – బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి

-

టీమ్​ఇండియా క్రికెటర్​ పంత్​ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశిరౌతేలా మధ్య కోల్డ్​ వార్​ సాగుతున్న విషయం తెలిసిందే. ఇక రెండు రోజుల కిందట.. ఇన్ స్టాంట్ బాలీవుడ్ అనే ఛానల్ తో మాట్లాడిన ఊర్వశి రౌటేలా, రిషబ్ పంత్ కు ఏం చెప్పాలనుకుంటున్నావని ప్రశ్నించగా, ఏం లేదనుకుంటూనే క్షమాపణలు చెప్పింది. అక్కడితో ఆగకుండా ఇవాళ మరో ట్విస్ట్‌ ఇచ్చింది ఊర్వశి.

రిషబ్ పంత్ కు క్షమాపణలు చెప్పిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేల అంతలోనే మాట మార్చింది. తాను పంత్ కు క్షమాపణలు చెప్పలేదని, తన ఫ్యాన్స్ కు చెప్పానని పేర్కొంది. తాను సారీ చెప్పింది పంత్ కు కాదని, తన ఫ్యాన్స్ కోసం చెప్పానని ఇన్ స్టా స్టోరీలో పేర్కొంది. ‘ఈరోజుల్లో కొన్ని అధికారిక న్యూస్, ఆర్టికల్స్, సో కాల్డ్ మీమ్ పేజీల అడ్మిన్లు సినిమాలు, టీవీ షోల కంటే ఎక్కువ డ్రామాలు రచిస్తున్నారు. నేను చెప్పిన సారీ నా ఫ్యాన్స్ కోసం, నా ప్రియమైన వారికోసం, అంతే, అంతకుమించి ఏమీ లేదు.’ అనే రాసుకొచ్చింది. అంతేగాక ఇదే స్టోరీలో హాస్ ట్యాగ్ లను జతపరిచింది.

Read more RELATED
Recommended to you

Latest news