బ్రేకింగ్‌: విరాట్ కోహ్లీ డ‌బుల్ సెంచ‌రీ, టెస్టుల్లో 7000 పరుగులు

-

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి డ‌బుల్ సెంచ‌రీ సాశ‌ధించాడు. (200 బ్యాటింగ్‌; 295 బంతుల్లో 28 ఫోర్లు) శతకం సాధించాడు. కోహ్లికి తోడు ర‌వీంద్ర జ‌డేజా క్రీజ్‌లో ఉన్నాడు. కోహ్లీ డ‌బుల్ సెంచ‌రీ చేసే టైంకు భార‌త్ 4 వికెట్ల న‌ష్టానికి 484 ప‌రుగుల‌తో ఆడుతోంది. 273/3 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లి, రహానేలు నిలకడగా ఆడి స్కోర్ బోర్డు ప‌రుగులు పెట్టించారు.

తొలుత ఆచితూచి ఆడిన కోహ్లి.. అనంతరం తన బ్యాట్‌ ఝుళిపించాడు. దీంతో స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టింది. మరోవైపు రహానే చాలా నెమ్మదిగా ఆడుతూ కోహ్లికి అండగా నిలిచాడు. ఆ త‌ర్వాత ర‌హానే 59 ప‌రుగుల వ‌ద్ద అవుట్ అయ్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన జ‌డేజా సైతం కోహ్లీకి అండ‌గా నిల‌వ‌డంతో కోహ్లీ డ‌బుల్ సెంచ‌రీ కంప్లీట్ చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news