శ్రీలంక టాప్ లేపిన న్యూజిలాండ్…అదరగొట్టిన బౌలర్లు!

-

ఈ రోజు బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియం లో జరిగిన కీలక మ్యాచ్ లో అర్ధభాగం ముగిసే సమయానికి న్యూజిలాండ్ పైచేయి సాధించింది. ముందుగా టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్ లలో కేవలం 171 పరుగులకే సరిపెట్టుకుంది. ఈ వరల్డ్ కప్ లో శ్రీలంక ఇప్పటికే సెమీస్ నుండి తప్పుకోగా, కివీస్ కు ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆశలు ఉంటాయన్న దశలో మంచి ప్రదర్శన చేసి శ్రీలంకను తక్కువ స్కోర్ కె కట్టడి చేసింది. శ్రీలంక ప్లేయర్స్ లో పెరీరా (51) అర్ద సెంచరీ చేయగా, ఆ తర్వాత తీక్షణ (38) టాప్ స్కోరర్ కావడం గమనార్హం.

ఇక కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, మిచెల్, రవీంద్ర మరియు ఫెర్గుసన్ లు తలో రెండు వికెట్లు తీసుకుని శ్రీలంక టాప్ లేపేశారు. ఇక కివీస్ ముందున్న పరుగుల లక్ష్యాన్ని త్వరగా ఛేదించి రన్ రేట్ ను తెచ్చుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news