TRS ప్లీనరీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి !

-

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రపన్నిన ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మున్నూరు రవి బుధవారం టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్లీనరీకి హాజరయ్యారు. ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన మున్నూరు రవి.. హైదరాబాద్ లో జరిగిన ప్లీనరీ లో పాల్గొనడం కలకలం రేపుతోంది.

దీనిపై మున్నూరు రవి ని మీడియా వివరణ కోరగా…. తాను ఉద్యమ సమయం నుంచి టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా కొనసాగుతున్నానని, పార్టీకి వీరాభిమానిని అని చెప్పాడు. ఈ అటు టిఆర్ఎస్ ప్లీనరీకి నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గైర్హాజరయ్యారు. దీనిపై జూపల్లి వివరణ కోరగా… కొల్లాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ కార్యకర్తలు అలాగే ఉద్యమకారులపై కేసులు, పోలీసుల తీరును సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లడానికి తాను హాజరు కాలేదని వెల్లడించారు. తాను మాత్రం టిఆర్ఎస్ పార్టీలో ని కొనసాగుతున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news