ఈనెల 8న తెలంగాణకు మోడీ..సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

-

ఈ నెల 8న తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ… ఆ రోజున రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు మోదీ.

ఆ తర్వాత రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు, రూ. 7,864 కోట్లతో నిర్మించే 6 హైవేలు, రూ.1,366 కోట్లతో చేపట్టే బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి పనులను ప్రారంభించి, పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభలో పాల్గొంటారు. ముఖ్యంగా సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. ఇక ఈ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌, లక్ష్మణ్‌ పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news