ఓటుకు నోటు కేసు : స్టీఫెన్ సన్ భూకబ్జా భాగోతం.. కూతురు పేరుతో !

-

వికారాబాద్ జిల్లా పూడురు మండల కేంద్రంలో ఓటుకు నోటు కేసులో కీలక వ్యక్తిగా ఉన్న స్టీఫెన్ సన్ భూకబ్జా భాగోతం బయటపడింది. ఆదివారం అడ్డంగా కబ్జాకు తెగబడ్డారు స్టీఫెన్ సన్ అనుచరులు. అడ్డుకునేందుకు వచ్చిన భూ యజమానిని బెదిరించారు. దీంతో పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..  3 ఎకరాల 10 గుంటల పొలంలో 1 ఎకరం 25 గుంటల భూమి నర్సింలు అనే వ్యక్తి.. స్టీఫెన్ సన్ కు అమ్మడు. ఆ భూమిని 2016లో స్టీఫెన్ సన్ కూతురు జెస్సికా పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

అయితే మిగిలిన 1 ఎకరం 25 గుంటల భూమి కూడా అమ్మాలని నర్సింలు కొడుకు వెంకటయ్యపై ఒత్తిడి తెస్తున్నారు స్టీఫెన్ సన్ అనుచరులు. జీవనాధారం కోసం హైదరాబాద్ లో ఉంటున్న వెంకటయ్య కుటుంబం.. వారు లేనిది చూసి స్టీఫెన్ సన్ అనుచరులు పొలాన్ని దున్నేశారు. అడ్డుకునేందుకు వచ్చిన వెంకటయ్య కుటుంబాన్ని బెదిరించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు..తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news