స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ విచిత్ర చేష్టలు..!

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ కోల్‌కతా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఇదిలా ఉంటే… చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్కు ముందు కొందరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు చేసిన విచిత్రమైన పనికి నెట్టింట విమర్శలొస్తున్నాయి.

WPLలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ పెర్రీ సిక్స్ కొట్టి కారు అద్దం పగలగొట్టడంతోనే వారు కప్ గెలిచారని, పురుషుల జట్టు కూడా అదే చేయాలని ఫ్యాన్స్ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో కొందరు ఆ కారు రూఫ్ టాప్ను పగలగొట్టారు. మ్యాచ్ గెలిచేందుకు ఇలాంటి పిచ్చి పనులేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.కాగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో ఒక విజయాన్ని సాధించగా, కోల్కత్తా నైట్ రైడర్స్ ఆడిన ఒక మ్యాచ్ లోను గెలుపొందింది.బెంగళూరు, కోల్‌కతా జట్ల మధ్య ఇప్పటి వరకు 32 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో RCB 14 గెలిచింది మరియు కోల్‌కతా 18 మ్యాచ్లలో గెలుపొందింది.

Read more RELATED
Recommended to you

Latest news