హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీయాలని ఎవ్వరూ కుట్ర చేసినా కఠిన చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్

-

హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీయాలని ఎవ్వరూ కుట్ర చేసినా కఠిన చర్యలు ఉంటాయని  మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. తాజాగా గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మా ప్రభుత్వాన్ని కూల్చుతామంటున్నాయి. కేసీఆర్ కూడా ప్రాంతీయతత్వం రెచ్చగొట్టారు. మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు ఇచ్చింది కేసీఆర్ కాదా..? అని ప్రశ్నించారు.

బిర్యాని మాది.. పెండ మీది అని కేసీఆర్ అనలేదా..? ప్రజా ప్రతినిధుల  పార్టీ ఫిరాయింపులను మేము ప్రోత్సహించలేదు. చిల్లర గాళ్ల గురించి మాట్లాడొద్దని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే నే కావాలనే ఆంధ్రా వాళ్లు అంటూ రెచ్చగొట్టారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు ప్రతిపక్షం భంగం కలిగిస్తోంది. బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ లో ఉన్న వారిపై తాము ఎప్పుడూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ పై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news