బాసర IIIT లో విద్యార్థి ఆత్మహత్య.. ఉద్రిక్త పరిస్థితులు

-

బాసర ట్రిపుల్ ఐటి లో మరోసారి ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్నాయి. త్రిబుల్ ఐటీ లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కళలం రేపుతోంది. త్రిబుల్ ఐటీ లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సురేష్ అనే విద్యార్థి హాస్టల్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరి వేసుకున్న స్థితిలో అతడిని గుర్తించిన ఇతర విద్యార్థులు వెంటనే నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కానీ అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

ఆసుపత్రికి చేరుకున్నారు డైరెక్టర్ సతీష్ కుమార్. విద్యార్థులు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ట్రిపుల్ ఐటి మెయిన్ గేటు వద్దకి విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. కళాశాల వద్ద ఉన్న పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారు విద్యార్థులు. దీంతో త్రిబుల్ ఐటీ వద్ద ఉధృక్త వాతావరణం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news