ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రైతులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ నెలలోనే అన్నదాత పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు రూ.15 వేలు అందిస్తామన్నారు.

CM Chandrababu Naidu gives good news to farmers of Andhra Pradesh

సూపర్-6 హామీలు అమలు చేయడంతోపాటు ఆర్థిక, ఆర్థికేతర అంశాలను పరిష్కరిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. కాగా కడపలో టీడీపీ మహానాడు జరుగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ ఐంది. దీనిపై తాజగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో టీడీపీ మహానాడు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news