హైదరాబాద్ లో 35 కే కిలో ఉల్లి.. ఆ కార్డు చూపిస్తేనే !

-

హైదరాబాద్ రైతు బజార్లలో 35 కే కిలో ఉల్లి విక్రయించనుంది తెలంగాణా ప్రభుత్వం. ఈరోజు నుండి రైతుబజార్లలో విక్రయిస్తున్నామని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఉల్లిధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. జంట నగరాల్లోని 11 రైతుబజార్లలో ఈ ఉల్లి అందుబాటులో ఉండనుందని ఆయన అన్నారు.

ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున విక్రయిస్తామని, ఏదైనా గుర్తింపుకార్డు చూపించి ఈ ఉల్లి కొంక్కోవచ్చని అన్నారు. భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా ఉల్లిపంట దెబ్బతిన్నదని ఆయన అన్నారు. ఎలాంటి లాభం లేకుండా రవాణా ఖర్చులు, దెబ్బతిన్న సరుకును దృష్టిలో ఉంచుకుని ఈ ఉల్లి అమ్మకాలు చేపట్టామని ఆయన అన్నారు. ఇక బయట మార్కెట్ లో అయితే ఉల్లి సెంచరీ కొట్టేసింది. కొన్ని చోట్ల అయితే డిమాండ్ ని బట్టి ఇంకా రేట్ పెంచేసి కూడా అమ్ముతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news