తిరుపతి ఎంపీ టికెట్ దక్కకపోవడంతో కంటతడి పెట్టిన సుగుణమ్మ

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకు  అనూహ్యంగా  మారుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. టికెట్ దక్కిన నేతలు సమరోత్సాహంతో ఎన్నికల కదనరంగంలోకి దిగుతుంటే.. టికెట్ ఆశించి భంగపడిన నేతలు తమ పార్టీలపైనే తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. మరికొందరు ఫ్లెక్సీలు తరగబెడుతూ అధినేతలకు వ్యతికేకంగా నినాదాలు చేస్తూ హడావుడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే టీడీపీ నుంచి తిరుపతి సీటు రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ బోరున విలపించారు. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న తనకు అధినేత చంద్రబాబు తీరని అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పేరుతో వైసీపీ నుంచి టీడీపీ చేరిన వారికి టికెట్లు ఇస్తున్నారని ఆసంతృప్తిని వ్యక్తం చేశారు. పైగా వారికి సపోర్టు చేయాలని చెబుతున్నారని, ఒక వేళ నేను అందుకు ఒప్పుకున్నా.. తన కేడర్ ఒప్పుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news