శరత్ బాబు సెట్ లో ఉంటే హీరోయిన్ లు సెఫ్‌ – సుహాసిని

-

కాసేపటి క్రితమే చెన్నైలో శరత్‌ బాబు మృత దేహానికి నటి సుహాసిని.. నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నటి సుహాసిని.. మాట్లాడుతూ.. ఆసుపత్రిలో ఉన్నప్పుడు శరత్ బాబును చూసి చిరంజీవి ఏడ్చేశారు… ఆయన ఓదార్చడం నా వల్ల కాలేదని వెల్లడించారు. ఒక మంచి అన్నయ్యను కొల్పోయానని.. శరత్ బాబుతో 40కు పైగా సినిమాలలో నటించానని పేర్కొన్నారు.

ఆయన కుటుంబంతో సైతం నాకు సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు నటి సుహాసిని. శరత్ బాబు లాంటి నటుడు లేని లోటు ఎవరు ఫుల్ ఫిల్ చేయలేరు… ఆయన లాంటి వ్యక్తి సెట్ లో ఉంటే మాలాంటి హీరోయిన్ లకు ఎటువంటి ఇబ్బంది ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషయంలో చిరంజీవి నేను,కమల్ హాసన్ ఎప్పటికప్పుడు ఆరా తీశాము…చివరికి ఆయనను బ్రతికించుకోలేకపోయామని వివరించారు నటి సుహాసిని.

Read more RELATED
Recommended to you

Latest news