దారుణం : 10 రోజుల క్రితం ప్రేమ జంట సూసైడ్.. కుళ్లిన స్థితిలో !

-

జగిత్యాల రూరల్ మండలం హైదర్ పల్లెలో గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపుతోంది. హైదర్ పల్లె గ్రామంలో పాడుబడిన ఇంట్లో పురుగుల మందు తాగి అనంతరం ఆ ఇంట్లోనే ఉన్న దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో యువకుడు హైదర్ పల్లె గ్రామనికి చెందిన మధు అని గుర్తించగా.యువతి ఎవరు అనే వివరాలు తెలియాల్సి ఉంది. పాడు బడిన ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడగా ఇంట్లో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి.

hanging-suicide
hanging-suicide

అయితే మధు పది రోజుల నుండి కనిపించకపోవడంతో ఈ ఇద్దరూ 10 రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు గ్రామస్థులు. డెడ్ బాడీ లు కుళ్ళిపోవడం తో ఉరి తాడు నుండి తల మొండెం కూడా వేరయ్యాయి. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే అసలు వీరిద్దరూ ప్రేమ జంట ఏనా ? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news