సుజనా చౌదరితో కలిసి ఏపీ సర్కార్ సేవలు

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొన్ని కొన్ని సేవా సంస్థలు ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి కూడా ఇందులో భాగం అయ్యారు. సుజనా ఫౌండేషన్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో 100 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ను కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడారు.

జీజీహెచ్ అనుబంధంగా ఈ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసామని ఆయన అన్నారు. 100 పడకలతో ఏర్పాటు చేశాం అని తెలిపారు. 24/7 ఆక్సిజన్ తోపాటు వైద్యులు అందుబాటులో ఉంటారు అని అన్నారు. 100 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభంతో కొంతమేర ప్రభుత్వాస్పత్రిపై భారం తగ్గుతుంది అని వెల్లడించారు. ప్రభుత్వ వైద్యులతోపాటు కొంతమంది ప్రైవేట్ వైద్య సిబ్బంది కూడా ఇక్కడ వైద్య సేవలందించేలా ఏర్పాట్లు చేశాం అని ఆయన వివరించారు

Read more RELATED
Recommended to you

Latest news