రఘురామ లాంటి సన్నాసిని ఎన్నుకున్నాం: వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారింది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఒకరు కీలక వ్యాఖ్యలు చేసారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడారు. 22నెలలుగా గెలిచిన దగ్గరనుండి ప్రజలకు, ప్రభుత్వానికి వెన్నుపోటు దారుడిగా,నీచమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి ఎంపీ కనుమూరి మిగిలారు అని అన్నారు. ప్రజలు అతనిని అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్ లో పనిచేసే వ్యక్తి కనుమూరి అని మండిపడ్డారు.

ఎంపీ అరెస్ట్ అనేది చట్టబద్ధమైన అంశం అని అతను దేశద్రోహితో సమానం… రాజద్రోహ కేసు నమోదు చేయాలి అని అన్నారు. ఇలాంటి సన్నాసిని ఎంపీ గా ఎన్నుకున్నందుకు సిగ్గు పడుతున్నాం అని విమర్శించారు. రెండు ఛానలల్లో పనికిమాలిన డిబేట్లు పెట్టుకుని బ్రతుకుతున్నాడు అని విమర్శలు చేసారు. కన్నతల్లి లాంటి పార్టీని దూషిస్తూ కనుమూరి సైకో,ఉగ్రవాది లాగా మారిపోయాడు అని మండిపడ్డారు. చంద్రబాబుతో కుమ్మక్కై ప్రభుత్వం మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడు అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news