తెలంగాణలో భానుడి భగభగ … రాగల 4 రోజుల్లో మరింతగా పెరగనున్న ఉష్ణోగ్రతలు

-

తెలంగాణలో భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత అధికం అవుతోంది. 40 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మార్చి చివరి వారమే ఇలా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే.. ఎప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు హడలిపోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోనే అధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదు అయ్యాయి. కొమురం భీం జిల్లా కెరమెరి లో 43.9 డిగ్రీలు, కౌటాల లో 43.7 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా చెప్రాల లో 43.8 డిగ్రీలు,  జై నాథ్ లో 43.8 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ లో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 

మరోవైపు రానున్న 4 రోజుల్లో మరింతగా ఎండల తీవ్రత పెరుగుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. కొన్ని చోట్ల సాధారణం కన్నా 2-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎప్రిల్ 1,2 తేదీల్లో ఉత్తర వాయువ్యం నుంచి వడగాలులు వీస్తాయని… మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news