బ్రేకింగ్ : ఆదిమూలపు సురేష్ కు సుప్రీం కోర్టు బిగ్ షాక్.. సీబీఐ విచారణకు గ్రీన్‌ సిగ్నల్‌ !

-

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతుల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ విచారణ.. ఇంకా కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం కోర్టు… సి ఆర్ పి సి ప్రకారం ప్రాథమిక విచారణ అవసరం లేదని పేర్కొంది. ప్రాథమిక విచారణ చేసిన తర్వాతే కేసు నమోదు చేయాలనే హక్కు నిందితుడికి లేదని తీర్పు ప్రకటించింది జస్టిస్ చంద్ర చుడ్ ధర్మాసనం.

అయితే ఈ కేసులో ప్రాథమిక విచారణ జరపకుండా సిబిఐ కేసు నమోదు చేయడంపై హైకోర్టును ఆశ్రయించారు ఆదిమూలపు దంపతులు. ఈ సందర్భంగా ఆదిమూలపు దంపతుల వాదనను సమర్థించింది హైకోర్టు. దీంతో హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది సిబిఐ. అయితే.. ఈ కేసు ను విచారించిన సుప్రీం కోర్టు… ఆదిమూలపు సురేష్ దంపతుల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ విచారణ.. ఇంకా కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఆదిమూలపు సురేష్‌ కు షాక్‌ తప్పలేదు.

Read more RELATED
Recommended to you

Latest news