సుప్రీం కోర్టును ఆశ్రయించిన సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి..?

-

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక సుశాంత్ మరణంపై అప్పట్లో ఎన్నో అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇక ఇటీవలే సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగిన విషయం తెలిసిందే. ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలి అంటూ… అమిత్ షా కు లేఖ రాసిన సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ని పోలీసులు కేసు నమోదు చేశారు.

రియా చక్రవర్తి పై కేసు నమోదు కావటంతో సుశాంత్ ఆత్మ హత్య కేసు కీలక మలుపు తిరిగింది.
రియా చక్రవర్తి పై కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. రియా చక్రవర్తి పై పాట్నా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న తరుణంలో రియా చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణను ముంబై పోలీసులకు అప్పగించాలి అంటూ రియా చక్రవర్తి కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి. రియా చక్రవర్తిని అరెస్టు చేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news