హైదరాబాద్‌ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి

-

హైదరాబాద్‌ లోని.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్ వెర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి చెందాడు. మియపూర్ దీప్తిశ్రీనగర్ లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సందీప్ (42)….అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ప్రమాదవశాత్తు నాలుగవ అంతస్థు పై నుండి తన లాప్ టాప్ తో సహా కింద పడి అనుమానాస్పద మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.

తీవ్ర రక్త స్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు సందీప్‌. దీంతో ఈ సమాచారం అందుకున్న పోలీసులు… మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అలాగే.. కేసు నమోదు చేసుకొని… అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు మియాపూర్ పోలీసులు. ప్రమాదవ శాతు జరిగింది అని అంటున్నారు సందీప్ తల్లిదండ్రులు. అయితే.. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరు.. ఎవరు ఉన్నారనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇంకా ఈ సంఘటన పై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news