మెడికల్ అధ్యాపకులకు తీపి కబురు.. భారీగా వేతనాల పెంపు..!

-

తెలంగాణ ప్రభుత్వం మెడికల్ అధ్యాపకులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ వైద్య విద్య, దంత కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులందరికీ భారీగా జీతాలను పెంచనుంది. వీరితోపాటు బోధనా సిబ్బందికి కూడా భారీగా వేతనాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మెడికల్ అధ్యాపకులకు ఏడో సెంట్రల్ ఏ కమిషన్ ఫార్ములా ప్రకారం జీతాలు చెల్లించనున్నట్లు, దీనికి సంబంధించిన నివేదికను మంగళవారం విడుదల చేశారు. త్వరలోనే వేతనాల పెంపు అమలులోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

మెడికల్ ఉద్యోగులు
మెడికల్ ఉద్యోగులు

కాగా, ఇటీవల పొరుగు రాష్ట్రంలో మెడికల్ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వేతనాలు భారీగా పెంచాయి. ఏడో పే కమిషన్ అమలుకు సంబంధించి గతేడాది జీవో జారీ చేశారు. కొత్త జీవోను వాడుకలోకి తీసుకొచ్చి మెడికల్ ఉపాధ్యాయులకు జీతాలు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీల్లో పని చేస్తున్న మెడికల్ ఉద్యోగులకు జీతాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్‌కు గతంలో రూ.70 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.86 వేలకు పెంచారు. అసోసియేట్ ప్రొఫెసర్‌కు గతంలో రూ.84 వేలు ఉంటే.. ప్రస్తుతం రూ.లక్షకు పెంచారు. సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్‌కు గతంలో రూ.1.24 లక్షల ఉంటే.. ప్రస్తుతానికి రూ.1.60 లక్షలకు పెంచారు. ప్రొఫెసర్‌కు గతంలో రూ.1.30 లక్షలు ఉంటే.. ప్రస్తుతానికి రూ.1.80 లక్షలకు పెంచారు.

నాలుగు రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం వైద్యుల ఓట్లను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఏడో పే కమిషన్ అమలు చేయడం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో విధులు నిర్వహించే 2,500 మందికి వేతనాలు పెంచనున్నారు. ఇందులో ప్రొఫెసర్లు, బోధన సిబ్బంది, ట్యూటర్లు కూడా ఉన్నారు. కాగా, పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయని చెప్పినప్పటికీ పాత ఏరియల్స్ రావాలంటే అందుకు ప్రత్యేక జీవో అమలులోకి తీసుకురావాలని వైద్యులు చెబుతున్నారు. దీంతో ప్రత్యేక జీవో జారీకి ప్రభుత్వం యోచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news