T20 ప్రపంచకప్ సెమీ ఫైనలిస్ట్ టీమ్స్ అవే :సునీల్ గవాస్కర్

-

జూన్‌ 2 నుంచి 29 వరకూ జరిగే T20 మెగా టోర్నీ కి అమెరికా, వెస్ట్ ఇండీస్ ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీ కోసం ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.కెనడాతో యూఎస్‌ఏ టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను ఆడనుంది. టీమిండియా జూన్ 5న తన మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనున్న విషయం తెలిసిందే.

పాకిస్థాన్‌, యూఎస్‌ఏ, కెనడా, ఐర్లాండ్‌తో కూడిన గ్రూప్‌లో టీమ్‌ఇండియా ఆడనుంది. ఈ మ్యాచులన్నీ అమెరికా వేదికగా జరుగుతాయి. ఈ గ్రూప్‌ స్టేజ్‌ను టీమిండియా అలవోకగా దాటేసే అవకాశం ఉంది. అయితే సూపర్ – 8లోనే అసలైన సవాల్ ఎదురుకానుంది. ఈ క్రమంలో సెమీస్‌కు చేరే 4 జట్లేవనేది ఆసక్తికరంగా మారింది.సెమీస్‌లో తలపడే 4 జట్లను టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ వెల్లడించాడు.భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ చెట్లు సెమీఫైనల్ కి అర్హత సాధిస్తాయని తెలిపారు. అతడితోపాటు పలువురు మాజీ క్రికెటర్లు అందరూ కూడా టీమిండియా సెమీస్‌కు వెళ్తుందని చెప్పడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news