T20WC: ఓపెనర్లుగా రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి!

-

టి20 ప్రపంచ కప్ ఆటకు సమయం ఆసన్నమైంది. బుధవారం(జూన్ 05) గ్రూప్‌ `ఎ` లో భాగంగా టీమిండియా ఐర్లాండ్‌తో తలపడనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.భారత కాలమాన ప్రకారం బుధవారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

ఐర్లాండ్తో జరగనున్న మ్యాచ్లో రోహిత్ శర్మ తో కలిసి విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. స్లో పిచ్ కావడంతో జైస్వాల్ బెంచ్కే పరిమితం కావొచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు శివమ్ దూబే, పంత్కు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది.

రోహిత్ సేన అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, రూపంలో బ్యాటింగ్.. పేసర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, స్పిన్నర్లలో కుల్దీప్, జడేజా కీలకం కానున్నారు.

భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ,విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, పంత్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్ , బుమ్రా, అర్ష్ దీప్

Read more RELATED
Recommended to you

Latest news