Tapsee Pannu : బాలీవుడ్ నటి తాప్సీపై కేసు నమోదు

-

ఇటీవల ఓ ఫ్యాషన్ వీక్​లో బాలీవుడ్‌ నటి తాప్సీ పన్ను ధరించిన నెక్లెస్​పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తాజాగా తాప్సీపై కేసు నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే మాలిని కుమారుడు ఏకలవ్య గౌర్‌ తాప్సీపై ఛత్రపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్‌ షోలో ఆమె లక్ష్మీదేవి నెక్లెస్‌ను ధరించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఓ మతాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేలా తాప్సీ వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాప్సీ ఇటీవల లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొంది. మార్చి 2న ముంబయి వేదికగా జరిగిన ఈ షోలో ఆమె రెడ్ కలర్ ఫ్రాక్ ధరించింది. అయితే ఈ డ్రెస్​లో తాప్సీ కాస్త క్లీవేజ్ షో చేసింది. అంతేకాకుండా లక్ష్మీదేవి పెండెంట్ ఉన్న నెక్లెస్​ను ధరించింది. ఇది కాస్త వివాదానికి దారి తీసింది. అసభ్యకరంగా ఉన్న దుస్తులు ధరించి లక్ష్మీదేవి నెక్లెస్‌ వేసుకోవడం పట్ల పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం సరికాదంటూ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే తాప్సీ డ్రెస్సింగ్‌ పట్ల అసహనం వ్యక్తం చేసిన ఏకలవ్య గౌర్‌.. తాజాగా పోలీసులను ఆశ్రయించారు.

Read more RELATED
Recommended to you

Latest news