బసవతారకం భూములు స్వాధీనం చేసుకోండి: హైకోర్ట్

-

ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక చార్జీల వసులుపై తెలంగాణా హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోలో, బసవతారకం ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయన్న పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విశ్రాంత ఉద్యోగి ఓ ఎం దేబరా దాఖలు చేసిన పిటీషన్ పై నేడు విచారణ జరిగింది. కొందరు పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరతో భూమి కేటాయించిందని పిటీషనర్ హైకోర్ట్ దృష్టికి తీసుకుని వెళ్ళారు.

High-court-for-state-of-Telangana-at-Hyderabad
High-court-for-state-of-Telangana-at-Hyderabad

అపోలో, బసవ తారకం ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదని పిటీషనర్ వాదించారు. షరతులు ఉల్లంఘిస్తే భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని హైకోర్ట్ ప్రశ్నించింది. అధిక బిల్లులు చెల్లించక పోతే మృతదేహం కూడా అప్పగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని.. భూములు వెనక్కి తీసుకోవాలని పేర్కొంది. అపోలో, బసవ తారకం ఆస్పత్రులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news