విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు పెట్టే ఆలోచనలేదు.. నిర్వహణపై మరోసారి చర్చిస్తాం : తలసాని

-

గణేష్ విగ్రహాల ఎత్తు విషయంలో ఆంక్షలు పెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై సహచర మంత్రులు మహమూద్‌అలీ, సబితా ఇంద్రారెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్‌, డీజీపీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చించారు.

Talasani
Talasani

జీహెచ్​ఎంసీలో రోజురోజుకీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరాన్నితలసాని గుర్తు చేశారు. వేదికల వద్దకు భారీగా జనం వచ్చే అవకాశం ఉండడం వల్ల భౌతిక దూరం వంటి అంశాలపై చర్చించారు. మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news