పబ్‌ లో అడ్డంగా నిహారిక బుక్‌…తమన్నా సింహాద్రి సంచలన వ్యాఖ్యలు

-

రాడికల్‌ పబ్‌ లో ఉగాది పర్వదినం అర్థరాత్రి అడ్డంగా నిహారిక బుక్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై తమన్నా సింహాద్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. పబ్ కి వెళ్లడం తప్పు అన్న విధంగా నిహారిక పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో ఒకరు పబ్ లో తప్పు చేస్తే పబ్ కి వెళ్లిన అందరిని దొంగల్లాగా చూస్తున్నారని మండిపడ్డారు.

నిహారిక ఫ్రెండ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం పబ్ కి వెళ్ళిందని పేర్కొన్నారు తమన్నా సింహాద్రి. అక్కడికి వెళ్లిన అందరిని వదిలేసి నిహారిక ని టార్గెట్ చేసి మీడియా, యూట్యూబ్ లో స్టోరీస్ వేస్తున్నారని నిప్పులు చెరిగారు. నిహారిక డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు చెప్పలేదని వెల్లడించారు. నిహారిక ఫ్యామిలీ విషయాలపై సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారని.. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. మెగా ఫ్యామిలీ అభిమానులుగా ట్రోల్ చేసిన వారిని అడ్డుకుంటామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news