తమిళనాడు సీఎంగా స్టాలిన్.. తొలిసారి కొత్త రికార్డు

-

చెన్నై: తమిళనాడు సీఎంగా డీఎంకే అధినేత స్టాలిన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. స్టాలిన్‌తో గవర్నర్‌ భన్వరీలాల్‌ ప్రమాణం చేయించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యమైన అతిథులను మాత్రమే ఆహ్వానించారు.

స్టాలిన్‌ తోపాటు 34 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. . దురైమురుగన్, కెఎన్‌. నెహ్రూ, ఐ. పెరియస్వామి, పొన్ముడి, వేలు, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, కేకేఎస్‌ఆర్‌ రామచంద్రన్, తంగం తెన్నరసు, రఘుపతి, ముత్తుస్వామి, పెరయకుప్పన్, టీఎం. అన్బరసన్, ఎంపీ స్వామినాథన్, గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, రాజకన్నప్పన్, కె. రామచంద్రన్, చక్రపాణి, వి. సెంథిల్‌ బాలాజీ, ఆర్‌. గాంధీ, ఎం సుబ్రమణియన్, పి. మూర్తి, ఎస్‌ఎస్‌ శివశంకర్, పీకె. శేఖర్‌బాబు, పళనివేల్‌ త్యాగరాజన్, ఎస్‌ఎం. నాజర్, సెంజి కేఎస్‌ మస్తాన్, అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి, ఎస్‌వీ గణేశన్, మనో తంగరాజ్, మదివేందన్, కయల్‌విళి సెల్వరాజ్‌ కు స్టాలిన్ మంత్రివర్గంలో చోటు దక్కింది.

 

ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వారసత్వ రాజకీయాల్లో స్టాలిన్ తమిళనాడులో రికార్డు సృష్టించారు. స్థాలిన్ కరుణానిధి కుమారుడు. ఇప్పటివరకూ తమిళనాడులో వారసులెవరూ సీఎం అయిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రిగా తొలిసారి స్టాలిన్ వారసత్వ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news