Tamilnadu : బాణ సంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు. పదిమంది మృతి.

-

తమిళనాడు:తమిళనాడులోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంబంధించింది. ఆ అగ్ని ప్రమాదంలో దాదాపు 10 మంది చనిపోయారు. వారిలో ఏడు మంది మృతదేహాలను గుర్తించామని, పలువురు తీవ్రంగా గాయపడ్డారు అని సమాచారం. ఈ ఘటన తమిళనాడు విరుదునగర్ సమీపంలోని ముత్తుసామి పురంలో విజయ్‌కు చెందిన బాణాసంచా ఫ్యాక్టరీ లో జరిగింది.

వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు.ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి బాణాసంచా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మరియు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి వెంటనే నష్టపరిహారం అందించాలని డిఎంకె ప్రభుత్వాన్ని కోరారు.అయితే ఈరోజు యధావిధిగా పనులు జరుగుతుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని,ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 30 మంది అక్కడ పనిచేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news