మాజీ సీఎం సతీమణి కన్నుమూత

-

ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య సతీమణి మణెమ్మ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మణెమ్మ పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆమె సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా పనిచేసిన ఆమె, 2008లో ముషీరాబాద్ అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికల్లో గెలుపొందారు. 1942 ఏప్రిల్ 29న హైదరాబాద్లో జన్మించిన ఆమె 1960లో అంజయ్యను వివాహమాడారు. వీరికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.  1980 అక్టోబరు నుంచి 1982 ఫిబ్రవరి వరకు టి. అంజయ్య ముఖ్యమంత్రిగా పనిచేసి సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news