Breaking: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి

-

నిన్న నారా లోకేశ్ పాదయాత్రలో నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోగా, వెంటనే ఆసుపత్రికి తరలించడం తెలిసిందే. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. గత రాత్రి తారకరత్నను మెరుగైన వైద్యం కోసం కుప్పం నుంచి బెంగళూరు తరలించారు. ప్రస్తుతం తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స జరుగుతోంది. ఈ నేపథ్యంలో, తారకరత్న తండ్రి మోహనకృష్ణ హృదయాలయ ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. పురందేశ్వరి, నందమూరి సుహాసిని తదితర నందమూరి కుటుంబసభ్యులు కూడా బెంగళూరు తరలివెళ్లారు.

టీడీపీ నేతలు దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప, పరిటాల శ్రీరామ్ ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బెంగళూరు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నారాయణ హృదయాలయ ఆసుపత్రి వద్ద భారీ పోలీసులను మోహరించారు. అయితే.. చంద్రబాబు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మరింత అప్డేట్‌ చెబుతారేమోనని అందరూ వేచిచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news