విషమంగా మారిన తారకరత్న ఆరోగ్యం.. బెంగుళూరుకు బాలయ్య..

-

నారా లోకేష్ పాదయాత్రకు వెళ్లిన తారకరత్న తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిపాలైన నందమూరి తారకరత్న ఆరోగ్య అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లుగా సమాచారం అందుతోంది..గత కొంతకాలంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన కోలుకుంటున్నారని అందరూ అనుకున్నారు. ఇప్పుడు పరిస్థితి తీవ్రంగా మారిందని, వైద్యానికి స్పందించడం లేదని తెలుస్తుంది..

గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్నకు విదేశీ వైద్యులతో సైతం చికిత్స అందితస్తున్నారు. మధ్యలో కాస్త కోలుకున్నట్లు కనిపించినా.. మళ్లీ అదే పరిస్థితి నెలకొన్నట్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో మరికాసేపట్లో సాయంత్రం 4.30 గంటలకు తారకరత్న ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు..

తారకరత్న ఆరోగ్యం విషమించడంతో బాలకృష్ణ హుటాహుటిన బెంగుళూరు చేరుకున్నారు. బాలయ్య తో పాటు నందమూరి కుటుంబసభ్యులు కూడా బెంగుళూరుకు వెళ్లారు.. ఆయన భార్య, కూతురు ఆసుపత్రిలోనే ఉన్నారు.. ఈ విషయం పై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.. ఒక్కసారిగా డాక్టర్లు చెప్పిన విషయం విన్న టీడీపీ అభిమానులు, కార్యకర్తలు షాక్ అయ్యారు.. తారక రత్న ఆరోగ్యం పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..ఏది ఏమైనా తారక రత్న చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి మనసున్న వ్యక్తి.. చాలా మందికి సాయం చేసారని చెబుతున్నారు.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా బెంగుళూరుకు వెళ్ళనున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news