పింక్ బట్టల్లో గుండాగిరి చేస్తున్నారు : తరుణ్ చుగ్

-

ఐపీఎస్ అధికారి ఖాకీ దుస్తులు వదిలి పింక్ బట్టలు వేసుకున్నారు… పింక్ దుస్తుల్లో గుండాగిరి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆ అధికారి పై సభా హక్కుల ఉల్లంఘన కేసు ఉందని.. తెలంగాణ లో కుటుంబ పాలన నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తరుణ్ చుగ్. తెలంగాణ ఆందోళన లో పాల్గొన్న వాళ్ళు ఈ రోజు మాతో ఉన్నారని.. మీ దగ్గర తెలంగాణ ఉద్యమం లో లేని వారు ఉన్నారని ఫైర్ అయ్యారు.

బండి సంజయ్ పై తప్పుడు కేసు పెట్టారని రుజువు అయిందని.. తెలంగాణలో కలోనియల్ రూల్ నడుస్తుందని నిప్పులు చెరిగారు. దేశం న్యాయం, చట్టం తో నడుస్తుంది…ఎంత మంది ని జైల్లో వేస్తావో వేయు.. ఎంత రాజరికం చూపిస్తావో చూపెట్టు అంటూ చురకలు అంటించారు. బంగారు తెలంగాణ కోసం బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ అధికారంలోకి వస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news