రాజావారితో జోడీ కట్టనున్న ప్రియాంక జవాల్కర్

-

విజ‌య్ దేవ‌రకొండకు జోడిగా టాక్సీవాలా సినిమాలో నటించిన ప్రియాంక జ‌వాల్క‌ర్ తన తొలి సినిమాతోనే మంచి విజ‌యాన్ని అందుకొంది. ఈ సినిమాలో త‌న హావ‌భావ‌ల‌తో యూత్ లో ఈ అమ్మ‌డు మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. దీంతో ప్రియాంక జ‌వాల్క‌ర్ ఇండ‌స్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోతుందని అంద‌రూ అనుకున్నారు. అయితే ఎందుక‌నో ఆమెకు అవ‌కాశాలు రాలేదు.

విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి హీరోతో న‌టించి, మెప్పించిన ఈ సుంద‌రి చాలా రోజుల నుంచి సినిమాలు లేక ఖాళీగానే ఉంటోంది. ఇక ప్రియాంక జ‌వాల్క‌ర్ ప‌ని అయిపోయింద‌ని అంద‌రూ మ‌ర్చిపోతున్న స‌మ‌యంలో ఈమెకు తెలుగులో మ‌రో ఆఫ‌ర్ ద‌క్కింది.

రాజావారు రాణిగారు చిత్రంతో హీరోగా ప‌రిచ‌యమైన కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఆ సినిమాలో మంచి న‌ట‌న‌ క‌న‌బ‌రించి ప్రేక్ష‌కుల మెప్పుపొందాడు. దీంతో కిర‌ణ్ హీరోగా మ‌రో సినిమా త్వ‌ర‌లో ప్రారంభ‌కానుంది. ఈ సినిమాను ఎలైట్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ నిర్మిస్తుండ‌గా,  శ్రీ‌ధ‌ర్ అనే నూత‌న ద‌ర్శ‌కుడు ఈ సినిమాను రూపోందించ‌నున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా టాక్సీవాలా ఫేం ప్రియాంక జ‌వాల్క‌ర్ ను తీసుకోనున్నారని స‌మాచారం.

ఇంకా షూటింగ్ ప్రారంభం కాని ఈ సినిమాకు ఎస్ఆర్ క‌ళ్యాణ మండ‌పం ఈస్ట్ 1975 పేరును ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని స‌మాచారం. అయితే ఈ సినిమాలో సాయికుమార్, తుల‌సిలు ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించ‌నున్నట్లు తెలుస్తోంది. మ‌రి చాలా రోజుల త‌రువాత ప్రియాంక జ‌వాల్క‌ర్ చేస్తున్న ఈ సినిమా ఆమెకు మరిన్ని ఆఫర్లు కట్టబెడుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news