పులివెందుల అభ్యర్థిగా వైఎస్‌ సునీత.. క్లారిటీ ఇచ్చిన టీడీపీ

-

పులివెందుల అభ్యర్థిగా వైఎస్‌ వివేకానంద రెడ్డి కూతురు అయిన సునీతను తెలుగు దేశం పార్టీ బరిలోకి దించబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై వైసీపీ పార్టీ తరఫున సజ్జల కూడా స్పందించారు. టీడీపీ టికెట్‌ కారణంగానే.. జగన్‌ ప్రభుత్వంపై వైఎస్‌ సునీత ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp clarity on Pulivendula candidate

అయితే.. దీనిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న క్లారిటీ ఇచ్చారు. పులివెందుల నుంచి బీటెక్ రవి పోటీ చేస్తారని చంద్రబాబు స్పష్టంగా చెప్పారని.. సునీత ఎందుకు పోటీ చేస్తుందని నిలదీశారు. సునీత వెనుక టిడిపి లేదని.. ఆమె పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.

వివేకా హత్య కేసు పై కోర్టుకు వెళ్తామని… ఇలా మాట్లాడితే మాపై కేసులు పెట్టవచ్చు, దాడులు చేయొచ్చు.. ఎదుర్కోవడానికి మేము సిద్ధమని సవాల్‌ విసిరారు. సునీతమ్మను కేసులో ఇరికించేలా ప్లాన్ చేయడం దుర్మార్గమని.. వివేకా హత్య జగన కు తెలిసే జరిగిందని ఆరోపణ చేశారు. అవినాష్ రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదు..? అని నిలదీశారు. అవినాష్ ను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయడం లేదు..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news