కుప్పంలో కూడా టిడిపి బలంగా లేదు – వై.వి సుబ్బారెడ్డి

-

ప్రతి ఎన్నికను చాలెంజ్ గా తీసుకొవాలన్నారు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి- సంక్షేమం అందిస్తూ.. వెనుకబడ్డ వర్గాలను ఏవిధంగా ముందుకు తీసుకు వెళుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెల్లాలన్నారు. దేశంలో బిసిలు ఉన్న రాష్ర్టాలలో‌ కూడా బిసిలకు ఇంత ప్రాధాన్యత ఉండదన్నారు. స్దానిక సంస్దల ఎన్నికలలో మనపార్టీ నుంచి ఎన్నికైన ఓటర్లు అత్యధికంగా ఉన్నారని తెలిపారు.

ప్రతి జిల్లాలో ఎలక్షన్ కోసం వార్ రూం ఏర్పటు చెస్తున్నమన్న ఆయన.. వైసిపి నేతలంతా కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సిఎం జగన్ బలహీన వర్గాలకు ఇచ్చిన ప్రాదాన్యత దేశంలో ఎవరూ ఇవ్వడం లేదన్నారు. ఇచ్చాపురమే కాదు కుప్పం లోనూ టిడిపి బలంగా లేదన్నారు వై వి సుబ్బారెడ్డి. ఈ ఎలక్షన్స్ ని సెమీపైనల్స్ గా భావిస్తున్నామన్నారు. న్యాయపరమైన చిక్కులు తొలగించుకొని విశాఖకు సిఎం రానున్నారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news