BREAKING : అసెంబ్లీ సమావేశాలకు టిడిపి దూరం..

-

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడు… దిశా నిర్దేశం చేశారు.

ఇక ఇవాళ మధ్యాహ్నం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ జూమ్ కాన్ఫరెన్స్ జరుగనుంది. ఈ సమావేశం అనంతరం అసెంబ్లీకి హాజరు కాకూడదని అధికారికంగా ప్రకటించనుంది టీడీఎల్పీ. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లరాదని ఇప్పటికే పొలిట్ బ్యూరోలో మెజారిటీ నేతల అభిప్రాయం తీసుకున్నారు.

సమావేశాలు జరుగుతున్న సమయంలో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ కార్యక్రమాల నిర్వహణపై టీడీఎల్పీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు చంద్రబాబు. కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు ఏపీ కేబినెట్ సమావేశం కూడా జరగనున్నట్లు సమాచారం అందుతోంది. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో… సభలోనే చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news