పరిటాల సునీత కుమారుడికి మరో షాక్ : నోటీసులు జారీ చేసిన పోలీసులు

-

పరిటాల సునీత కుమారుడు పరిటాల సిద్ధార్థ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బుల్లెట్ తో సిద్ధార్థ్ పట్టుబడగా.. తాజాగా దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు ఎయిర్ పోర్ట్ పోలీసులు. సిద్ధార్థ్ లైసెన్స్ డ్ గన్ కు బ్యాగు లో దొరికిన బులెట్ కు వ్యత్యాసం ఉందని గుర్తించిన పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. గతంలో పాయింట్ 32 క్యాలిబర్ గన్ కు సిద్ధార్థ్ లైసెన్స్ పొందగా.. బుధవారం ఎయిర్ పోర్ట్ లో సిద్ధార్థ్ బ్యాగు లో మాత్రం 5.56 క్యాలిబర్ బుల్లెట్ లభ్యం అయింది.

సిద్ధార్థ్ వద్ద సాయుధ బలగాలు వాడే ఇన్సాస్ రైఫిల్స్ బుల్లెట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ బుల్లెట్ సిద్ధార్థ్ కు ఎక్కడి నుంచి వచ్చిందన్న దాని పై విచారణ చేపట్టారు ఎయిర్ పోర్ట్ పోలీసులు. అనంతపూర్ కు చెందిన ఇండో టిబెటెన్ బోర్డర్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ తూటా గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎయిర్ పోర్ట్ పోలీసులు. కానిస్టేబుల్ తో పరిటాల కుటుంబానికి పరిచయాలు ఉన్నట్లు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news