మద్యం గురించి మాట్లాడేహక్కు తమరికుందా నిమ్మల!

-

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా తయారయ్యింది ఏపీలో టీడీపీ నేతల పరిస్థితి! జనాలకు ఏమీ గుర్తుండవులే.. మనకు మైకులున్నాయికదా ఏదైనా మాట్లాడొచ్చులే.. వస్తే కొండ పోతే వెంట్రుక అన్నట్లుగా మాట్లాడేస్తున్నారనే కామెంట్లు తెచ్చుకుంటున్నారు టీడీపీ నేతలు. ఈ విషయంలో తాజాగా మైకులముందుకు వచ్చారు పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు!

మద్యపాన నిషేధం అంటూ ఆడపడుచుల అభిమానాన్ని సంపాదించుకుని.. అన్నగారిగా పేరుతెచ్చుకున్న మహానాయకుడు నందమూరి తారక రామారావు ఒక వెలుగు వెలుగొందించిన పార్టీ టీడీపీ! ఆ మహానాయకుడికి వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కిన అనంతరం రాష్ట్రం మొత్తం మద్యాన్ని ఏరులైపారించారు చంద్రబాబు! ఆడపడుచుల తాలిబొట్లతో ఆట్లాడారు! ఆ విషయాలు జనం మరిచారనుకున్నారో ఏమో కానీ… ఇప్పుడు మద్యం వల్ల తాళిబొట్లు తెగిపోతున్నాయని చెప్పుకొస్తున్నారు ఏపీ టీడీపీ నేతలు!

రాష్ట్రం మొత్తం బెల్టు షాపులతో నింపేసిన టీడీపీ నేతలు… నేడు, మద్యంతో పేదల ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పుకొస్తున్నారు. వీది వీదికీ బెల్టు షాపులు పెట్టి కుటుంబాలు చిధ్రం అవ్వడానికి పరిపూర్ణ కారకులైన టీడీపీ నేతలు.. నేడు, రాష్ట్రంలో పిచ్చి బ్రాండ్లు, అనామక మద్యంతో తాళిబొట్లు తెగుతున్నా జగన్‌ కు లెక్క లేదని చెప్పుకొస్తున్నారు! ఈ లెక్కన ఆలోచిస్తే… ముందుగా చెప్పుకున్నట్లుగా.. “నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు” అన్న చందంగా ఉంది టీడీపీ నేతల తీరు అని పలువురు అభిప్రాయపడుతున్నారు!

-Ch Raja

Read more RELATED
Recommended to you

Latest news