మీ వెర్రి తనం చూసి జనాలు నవ్వుకుంటారు అన్నా: రామ్మోహన్ నాయుడు

-

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీని గట్టిగా టార్గెట్ చేస్తున్న నేపధ్యంలో వైసీపీ నేతలు కూడా అదే విధంగా టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తాజాగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీ మెడలు వంచుతా అని శపధాలు చేసి, అక్కడికెళ్లి కాళ్ళు మొక్కుతోంది ఎవరో, ఎందుకో అందరికీ తెలుసు అంటూ విజయసాయి కి కౌంటర్ ఇచ్చారు.

పార్లమెంట్లో 28 ఎంపీలు ఉన్నా, ఒక్కరు కూడా అక్కడ గొంతెత్తి ప్రశ్నించకుండా, ప్రతిపక్షం సమావేశాల్లో ఎమీ మాట్లాడలేదు అంటూ దద్దమ్మ కబుర్లు చెపితే, మీ వెర్రితనం చూసి జనాలు నవ్విపోతారన్నారు. 28 ఎంపీలు ఉన్నారుగా, వచ్చే పార్లమెంట్ సెషన్లో VSP అమ్మకానికి వ్యతిరేకంగా తీర్మానం పెట్టే దమ్ము మీకుందా? రాష్ట్ర ప్రజల మంచి కోసం రాజకీయాలు పక్కన పెట్టి, ఆ తీర్మానానికి మనస్పూర్తిగా మద్దతు ఇచ్చే చిత్తశుద్ధి మాకుందని స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news