వైసిపి పాలనపై యనమల వివాదాస్పద వ్యాఖ్యలు

-

 

 

జగన్ చెబుతున్న సామాజిక న్యాయం నేతిబీరకాయ చందం లాంటిదని యనమల ఫైర్ అయ్యారు. సంక్షేమ పథకాల్లో నిబంధనలు పెట్టి లక్షలాది మందిని తొలగించారు…దళితులు, గిరిజనులు, బీసీలపై దాడులు, హత్యలు చేశారని మండిపడ్డారు. సంక్షేమంలో పెట్టిన కోతలపై జగన్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయగలడా? జగనుకి ప్రచారం చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కరించడంపై లేదని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో అన్నింటికంటే ముఖ్యమైనవి సమసమాజ, నవ సమాజ స్థాపనలు.. వీటిని జగన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. జగన్ చెప్పే మాటలు నేతబీరకాయలో నెయ్యి చందంలా ఉన్నాయన్నారు యనమల.

జగన్ చెబుతున్న సామాజిక న్యాయం పెద్ద బూటకం అని…జగన్ చేస్తున్న సామాజిక న్యాయం కంటే.. చేసిన సామాజిక అన్యాయమే ఎక్కువ అని తెలిపారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి సామాజిక విద్రోహానికి జగన్ శ్రీకారం చుట్టాడు…పేద, మధ్య తరగతి వర్గాలకు న్యాయం చేయకపోగా సామాజిక న్యాయం జరిగిందని బుకాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. అమ్మఒడి, విద్యాదీవెన, విద్యా కానుక, తెల్ల రేషన్ కార్డులు, రైతు భరోసా.. ఇలా ప్రతీ పథకంలో కోతలు పెట్టారు.పథకాలపై నిబంధనలు పెట్టి లక్షలాధిమందిని తొలంగించారన్నారు.

 

దళితులు, గిరిజనులు, బీసీలపై దాడులు, హత్యలు పెరిగిపోయాయి….జగన్ పాలనలో ప్రజలకు న్యాయం జరగడం లేదని ప్రతిపక్షాలు, పత్రికలు, మేదావులు అభిప్రాయపడుతున్నారని చురకలు అంటించారు. జగన్ నిస్సిగ్గుగా ప్రజలు సంతోషంగా ఉన్నారని మాట్లాడుతున్నాడు…సామాజిక న్యాయం కోసం మూడు సంవత్సరాలలో జగన్ ఏం చేశాడో చెప్పాలి.జగనుకి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా సంక్షేమంలో పెట్టిన కోతలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు యనమల.

Read more RELATED
Recommended to you

Latest news