టేకు చెక్కతో మోడీ విగ్రహం.. కేరళ కళాకారుడి అద్భుతం..!

-

రాజసం ఉట్టిపడేలా ఉన్న టేకు చెక్కతో ప్రధాని మోడీ అద్భుతమైన విగ్రహాన్ని చెక్కి ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కేరళలోని త్రిసూర్ జిల్లా కొడంగల్లూర్ కు చెందిన రవీంద్రన్ వృత్తి రిత్యా శిల్పకళాకారుడు. అంతేగాక ప్రధాని మోడీకి వీరాభిమాని. ఈ అభిమానంతోనే రాజసం ఉట్టపడేలా మోడీ నడుచుకుంటూ వస్తున్న విగ్రహాన్ని చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు. టేకు చెక్కతో చేయబడిన ఈ బొమ్మ 6.5 అడుగుల ఎత్తుతో అద్భుతంగా నిర్మించబడింది.

నరేంద్రమోడీ వరసగా మూడో సారి ప్రధాని పదవి చేపట్టిన సందర్భంగా ఈ అద్భుతమైన శిల్పంతో మోడీకి శుభాకాంక్షలు చెబుతున్నాడు. ఈ చిత్రాన్ని తన శిల్పశాలలో ఉంచడంతో పలువురు వచ్చి సందర్శిస్తున్నారు. దీంతో ఈ శిల్పానికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెట్టింట ఈ అద్భుతమైన కళాకండాన్ని చూసిన నెటిజన్లు శిల్పకళాకారుడి ప్రతిభను తెగ మెచ్చుకుంటున్నారు. తన అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్న రవీంద్రన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేగాక ఈ వీడియో ప్రధాని మోడీ వరకు చేరేలా షేర్ చేయాలని మోడీ అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news