టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్ ప్రపంచ​ రికార్డ్​.. తొలి ఆటగాడిగా

-

టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ను అధిగమించి రోహిత్‌ శర్మ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆసియాకప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రోహిత్‌ ఈ ఘనతను అందుకున్నాడు.

ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో 3499 పరుగులతో రోహిత్‌ టాప్‌లో ఉండగా.. గప్టిల్‌(3497), విరాట్‌ కోహ్లి(3341) పరుగులతో రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ పోరులో టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సిక్స్‌ కొట్టి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తద్వారా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి టీమ్​ఇండియా బదులు తీర్చుకుంది. తద్వారా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. కాగా, మొదట పాకిస్తాన్‌ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌట్‌ కాగా.. ఇండియా ఆ లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో ఛేదించింది. పాక్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ రిజ్వాన్‌ 43 పరుగులు చేసి.. రాణించారు.

Read more RELATED
Recommended to you

Latest news